ACB ride : ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రెటరీ
By
Vaasthava Nestham
• రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు
వాస్తవ నేస్తం,నిర్మల్: అక్రమ సంపాదన కోసం కొందరు అడ్డదారులు తొక్కుతూ ఏసీబీ కి చిక్కుతున్నారు. లంచాలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కి కటకటాల పాలవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని గోడిసెర్యాల గ్రామ పంచాయతీ సెక్రటరీ ( panchayat secretary ) శివ కృష్ణ లంచం తీసుకుంటూ ఏసీబీ చిక్కాడు. మంగళవారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గోసుకుల రాజేశం అనే వ్యక్తి వద్ద నుండి రూ.12 వేల రూపాయలు లంచం తీసుకొనగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
గోడిసెర్యాల గ్రామానికి చెందిన గోసుకుల రాజేశం గ్రామంలో వాటర్ ప్లాంట్ ( water plant )ఏర్పాటు కోసం పంచాయతీ సెక్రెటరీని పర్మిషన్ అడిగారు. దీంతో సెక్రటరీ శివ 12 వేల రూపాయలు డిమాండ్ చశాడని, దీంతో రాజేశం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పథకం ప్రకారం మంగళవారం గోడిసెర్యాల గ్రామపంచాయతీ కార్యాలయంలో లంచం తీసుకుంటూ పట్టుబడ్డ పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులు పట్టుకొని విచారిస్తున్నారు.
Comments