ప్రాణం తీసిన విద్యుత్ తీగ..!?
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో రైతు ప్రాణం పోయిందని, మృతి చెందిన రైతు కుటుంబ సభ్యులు ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆదిలాబాద్ జిల్లా నేరేడిగొండ మండలం లింగట్ల గ్రామానికి చెందిన సాబ్లె సుభాష్ అనే రైతు తన పంట చేనులోని పత్తిలో కలుపుతీస్తుండగా కిందకి వేలాడుతున్న విద్యుత్ తీగలు ప్రమాదవశాత్తు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
తన చేనులో విద్యుత్ తీగలు కిందికి వేలాడుతున్నాయని పలుమార్లు విద్యుత్ అధికారులకు మోరపెట్టుకున్న పట్టించుకోలేదని దీంతో ఈ రోజు (బుధవారం) విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం పోయిందని మృతి చెందిన రైతు బంధువులు ఆరోపించారు. రైతు మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని,మృతుని కుటుంబానికి నష్టపరిహారం అందజేసి బాధిత కుటుంబ సభ్యులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Comments