అప్పుల బాధతో జీపీ వర్కర్ ఆత్మహత్య
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ: తాను చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్థాపం చెంది ఓ జీపీ మల్టీ పర్పస్ వర్కర్ మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది. ఎస్సై తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బోరిగామ గ్రామానికి చెందిన బొల్లి రాజు (40) జీపీ మల్టీపర్పస్ వర్కర్ గా పనిచేస్తున్నాడు. గ్రామ సంఘం నుండి అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించే సమయం దగ్గర పడడంతో తాను అప్పుగా తీసుకున్న డబ్బులు ఎలా చెల్లించాలో తెలియక మనస్థాపం చెంది, గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments