-Advertisement-

సామాజిక సేవా కర్త హకీమ్ కు డాక్టరేట్

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,పోతంగల్ : నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలంలోని జల్లపల్లి గ్రామానికి చెందిన  ప్రముఖ సామాజిక సేవా మూర్తి డాక్టర్ ఎంఏ.హకీమ్ కు హైదరాబాద్ కు చెందిన ఫ్రెండ్జిప్ మినిస్ట్రీస్ సంస్థ డాక్టరేట్ ప్రదానం చేసింది. ఆయన చేస్తున్న సోషల్ సర్వీస్ దృష్ట్యా డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ అవార్డు 2025 అందజేశారు. కోటగిరి, పోతంగల్, ఉమ్మడి మండలాలతోపాటు చుట్టుపక్కల మండలాల్లో పేదలకు వైద్యం, విద్య, వివాహం వంటి సమయాల్లో వేల మందికి ఆర్థిక సాయం, నిరుపేదల పెండ్లిళ్లకు సామగ్రి అందజేత, యువకులకు క్రికెట్ కిట్లు, బడి పిల్లలకు బుక్స్, ప్లేట్లు, పిల్లల చదువుల కోసం స్కూళ్లలో విద్యా వలంటీ ర్లను ఏర్పాటు చేసి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. 
డాక్టరేట్ అందజేసిన ఫ్రెంర్షిప్ మినిస్ట్రీస్ హైదరాబాద్ వారికి, హకీమ్ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మీడియా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాను కోటగిరి పోతంగల మండల ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల కృషి వల్ల నాకు ఇంత పెద్ద డాక్టరేట్ అవార్డు మరియు గ్లోబల్ అవార్డు దొరకడంలో మీ అందరి కృషి ఎప్పటికప్పుడు వార్తలు రాయడం వల్ల నాకు ఈ అవార్డులు అందినాయి మీరు చేసిన ఈ సహకారం ఈ  జన్మలో మరువనిది కాబట్టి పత్రిక సోదరులకు మీడియా సోదరులకు అందరికీ చేతులు పెట్టి ధన్యవాదాలు నమస్కారాలు చేయుచున్నాను మీ కృషి మీ సహకారం నాకు ఎప్పుడు ఉంటుందని ఆశిస్తూ మీ పెద్దన్నాగా నన్ను భావించి నాకు ఎప్పుడూ సహకరిస్తారని కోరుకుంటు  ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికీ  డాక్టర్ ఎం ఏ అకీమ్ కృతజ్ఞతలు తెలిపారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.