టెక్నికల్ ప్రాబ్లమ్ అంటూ.. బాదుడు
By
Vaasthava Nestham
• ప్రయాణికుల నుండి అదనపు చార్జీలు వసూలు చేస్తున్న ఆర్టీసీ
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: టెక్నికల్ ప్రాబ్లం ఉంది అంటూ ఆర్టీసీ ప్రయాణికులపై అదనపు భారాన్ని వేస్తోంది. ఆర్టీసీ టెక్నికల్ ప్రాబ్లమ్ ఏంటో గాని ప్రయాణికులకు అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి నిర్మల్ జిల్లాకు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ లో ప్రయాణించే ప్రయాణికుల నుండి 80 రూపాయల ఛార్జి వసూలు చేస్తుంది. కానీ ఈరోజు ఉదయం( సోమవారం) 80 రూపాయల ఛార్జి కాస్త 100కు చేరింది. ఆదిలాబాద్ నుండి నిర్మల్ కు ప్రయాణించే ప్రయాణికులకు ఎక్స్ప్రెస్ బస్సులో 120 చార్జీలు ఉండగా అదనంగా ఈరోజు పది రూపాయలు అనగా 130 చార్జి వసూలు చేసినట్లు ప్రయాణికులు వాపోయారు. ఒకేసారి అదనపు చార్జీలు వసూలు చేయడంతో ప్రయాణికులు అవక్కయ్యారు. ఇది ఏంటి అని సదరు బస్ కండక్టర్ ను ప్రయాణికులు ప్రశ్నించగా పైనుండి టెక్నికల్ ప్రాబ్లం ఉందని అందుకుగాను రూ.80 కి గాను 100 రూపాయలు వసూలు చేస్తున్నామని కండక్టర్ చెప్పుకోరావడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టెక్నిక్ ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయాలి గాని అదనపు చార్జీలు బాదుడు ఏంటి అని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు.
Comments