-Advertisement-

పోలీసులమంటూ బెదిరింపులు.. ఆపై డబ్బులు వసూల్

Vaasthava Nestham

• డబ్బులు వసూలు చేస్తున్న ముఠా అరెస్ట్ రిమాండ్
• తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బెంగళూరు, చెన్నైలలో రూ.18 లక్షల మోసం
• మోసగించిన డబ్బులతో మేకల వ్యాపారం
• నష్టాలు రావడంతో మళ్ళీ మోసాలు 
• ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదు ఐదుగురిపై కేసు, నలుగురి అరెస్టు రిమాండ్ తరలింపు
• వాహనాలు, వెండి, బంగారం స్వాధీనం
• వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్


వాస్తవ నేస్తం,ఇచ్చోడ : వారు నకిలీ పోలీసులుగా అవతారమెత్తారు. నేను ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నుంచి ఎస్సైని మాట్లాడుతున్నాను.. మీరు దొంగ బంగారం కొన్నారు. మీ మీద కేసు నమోదు కాకుండా ఉండాలంటే ఫోన్ పే, గూగుల్ పే ద్వారా డబ్బులు పంపించాలంటూ బెదిరించారు. సదరు వ్యాపారికి అనుమానం వచ్చి వెంటనే ఇచ్చోడ ఎస్ఐ అధికారిక నంబర్ కు ఫోన్ చేయడంతో నకిలీ పోలీసులని తేలింది. నకిలీ ఎస్ఐ గా అవతారం ఎత్తిన వారిని గుర్తించి, అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహజాన్ తెలిపారు. అరెస్ట్ అయిన నిందితులు అందరూ ఆదిలాబాద్ జిల్లా నందు ఎలాంటి మోసాలకు పాల్పడలేదని, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలలో మోసాల కు పాల్పడ్డారనీ ఎస్పీ స్పష్టం చేశారు. గురువారం ఇచ్చోడ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. 
గత నెల జూన్ 27వ ఇచ్చోడ ఎస్ఐ పురుషోత్తం కూ కొండొజు నరసింహచారి (రంగారెడ్డి జిల్లా నివాసి) అనే వ్యక్తి ఫోన్ చేసి, తన సోదరుడు చేపురి సతీష్ కుమార్‌కు 6301395160 నంబర్ నుండి కాల్ వచ్చిందని, అవతలి వ్యక్తి తాను ఇచ్చోడ పీఎస్‌ ఎస్‌ఐ నర్సిరెడ్డిని అని పరిచయం చేసుకుని, నాలుగు సంవత్సరాల క్రితం 11 గ్రాముల దొంగ బంగారం కొన్నా రని, కేసు కాకుండా ఉండాలంటే ఫోన్‌పే/గూగుల్ పే ద్వారా డబ్బులు పంపాలని చెప్పారని ఫిర్యాదు చేశారు. అనుమానం వచ్చి, ఎస్‌ఐ ఇచ్చోడ అధికారిక నంబర్‌కు ఫోన్ చేయగా, అది నకిలీ పోలీసు అని తెలడంతో ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో రెండవ సారి ఈ నెల జూలై 4న రుద్రంగి కిరణ్ కుమార్ (హైదరాబాద్ నివాసి) అనే వ్యక్తి ఇచ్చోడ ఎస్‌ఐ కి ఫోన్ చేసారు. బాధితునికి 9866193420 నంబర్ నుండి కాల్ చేసి ఎస్‌ఐ నర్సిరెడ్డి, ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నానని బుకాయించి, దొంగ బంగారం కొన్నారని బెదిరించి డబ్బులు పంప మని కోరగా, గూగుల్ పే ద్వారా రూ.150 పంపినట్లు తెలిపారు. తర్వాత అనుమానం వచ్చి ఎస్‌ఐ ఇచ్చోడ కు తెలియజేయగా, అది కూడా నకిలీ పోలీసు అని తెలిసింది. రెండవ కేసును వెంటనే ఇచ్చోడ పోలీస్ నమోదు చేశారు. కేసుల దర్యాప్తు ప్రక్రియలో భాగం గా, సాంకేతిక ఆధారాల ద్వారా నలుగురు నిందితు లను గుర్తించి అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి ఒక బెలానో కారు, ఒక బుల్లెట్ బైక్, ఆటో, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. నిందితులందరూ నల్గొండ జిల్లాకు చెందిన వారని చెప్పారు. 

నిందితుల వివరాలు...


షేక్ ఇర్ఫాన్ పశువుల వ్యాపారీ, గ్రామం నిడమనూరు. ప్రస్తుతం ఉంటున్న గ్రామం మాన్యం చల్క, నల్గొండ, చింతలచెరువు ప్రశాంత్, లారీ క్లీనర్, నల్గొండ జిల్లాలోని నిడమనూరు గ్రామం, బదనపూరి అజయ్, మోటార్ మెకానిక్, నిడమనూరు, నల్గొండ జిల్లా, బొప్పం సుధాకర్, సెల్ పాయింట్, నిడమ నూరు గ్రామం, నల్గొండ జిల్లా, వోట్కూరి నరేష్ (పెట్రోల్ బంకు ఉద్యోగి) ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. విచారణలో షేక్ ఇర్ఫాన్ తన నేరాన్ని అంగీకరించాడని, తాను జల్సాలకు అలవాటు పడి గత కొన్ని సంవత్సరాలుగా గూగుల్ ద్వారా నగల షాపుల వివరాలు తెలుసుకుని వారికి కాల్ చేసి, తాను ఎస్‌ఐని అని, రెండు సంవత్సరాల క్రితం ఒక జంట వద్ద నుండి 11 గ్రాముల దొంగ బంగారం కొన్నా రని, మీపై కేసు నమోదు అవుతుందని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు నిందితుడి తెలిపాడని, ఇతనిపై గతంలో నల్గొండ జిల్లాలో కేసులు నమోదై జైలు కు వెళ్లివచ్చాడని ఎస్పీ చెప్పారు. మార్చిలో జైలు నుండి విడుదలయ్యాక తిరిగి జల్సాలకు అల వాటు పడి, గత మూడు నెలల్లో హైదరాబాద్, ఆంధ్ర ప్రదేశ్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని ఆభరణాల షాపుల యజమానులకు ఫోన్ చేసి దాదాపు రూ.18 లక్షలు వసూలు చేసి జల్సాలకు వాడుకున్నాడని ఎస్పీ తెలిపారు. కొంత డబ్బులతో ఒక బెలానో వాహ నం, బుల్లెట్ మోటార్ సైకిల్, బజాజ్ మాక్సిమా ఆటో రిక్షా, కొనుగోలు చేశాడని, 1.36 గ్రాముల బంగారం, 14 తులాల వెండి కాలి పట్టీలను తన భార్యకు ఇచ్చినట్లు నిందితుడు తెలిపాడని ఎస్పీ పేర్కొన్నారు. అతని వద్ద మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. చింతలచెరువు ప్రశాంత్ లారీ క్లీనర్ పని చేస్తూ, గూగుల్ మ్యాప్స్‌పై అవగాహన ఉండటంతో షేక్ ఇర్ఫాన్‌తో కలిసి జ్యువెలరీ షాపుల వివరాలను తన ఫోన్‌లో చూసి, యజమానుల నంబ ర్‌లు తీసుకుని వారికి పోలీసులు అని ఫోన్ చేసి బెదిరించి, ఇర్ఫాన్ డబ్బులు వసూలు చేయగా తనకు కొంత డబ్బు ఇచ్చేవాడని ఒప్పుకున్నాడనీ, బదన పూరి అజయ్ వీరితో స్నేహం చేసి వారి నేరాలకు సహకరించాడనీ, బొప్పం సుధాకర్ తన మొబైల్ షాపులో ఈ డబ్బులను తన అకౌంట్‌లో జమ చేయించుకుని షేక్ ఇర్ఫాన్, చింతలచెరువు ప్రశాంత్ కూ ఆ డబ్బులను ఇచ్చేవారని తెలిపారు. వోట్కూరి నరేష్ పెట్రోల్ బంకులో పని చేస్తూ, ఇర్ఫాన్ తన ఖాతాలోకి డబ్బులు పంపించగా, వాటికి కమీషన్ తీసుకుని మిగతా డబ్బులు ఇర్ఫాన్‌కు ఇచ్చేవాడని, ఎస్పీ వివరించారు. నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ చెప్పారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అను మానాస్పద కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమా చారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. ఈ సమావే శంలో ఉట్నూర్ ఏఎస్పి కాజల్ సింగ్, ఇచ్చోడ సీఐ బండారి రాజు, ఎస్ఐ వి పురుషోత్తం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.