పచ్చని గుట్ట అన్యక్రాంతం..
By
Vaasthava Nestham
• పర్యావరణానికి పొంచి ఉన్న ముప్పు
• మొరం మాఫియాకు కాసులు కురిపిస్తున్న కుప్టి గుట్టలు
• టిప్పర్ల ద్వారా, ట్రాక్టర్ల ద్వారా మొరం తరలింపు
• కనుమరుగు కానున్న ప్రకృతి సంపద
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా అంటేనే పచ్చదనానికి పెట్టింది పేరు. అడవులు.. కొండలు... గుట్టలు.. అందమైన జలపాతాలు.. నాలుగు వరుసల జాతీయ రహదారుల వెంట ప్రకృతి రమణీయమైన గుట్టలు..సెలయేళ్ళు... కిలకిల పక్షుల రాగాలు.. చెంగు చెంగున ఎగిరే వన్యప్రాణులు... ఇవన్నీ అదిలాబాద్ జిల్లాకు మణిహారం. పర్యాటక ప్రేమికుల మనసులను ఇట్టే ఆకట్టుకుంటాయి. వారిని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అలాంటి ప్రకృతి సంపదపై కొందరి కన్ను పడింది.. సంపదను దోచుకెళ్తున్నారు.. పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని తెలిసి కూడా సంబంధిత అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తుండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
వాస్తవ నేస్తం రేపటి సంచికలో...
Comments