-Advertisement-

సీనియర్ జర్నలిస్ట్.. మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ కన్నుమూత

Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: సీనియర్ జర్న లిస్ట్, మాజీ ఎమ్మెల్సీ ఆర్.సత్యనారాయణ కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న సత్యనారాయణ ఆదివారం సంగారెడ్డి లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. సత్యనారాయణ కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ( member of legislative council ) 2007లో గెలుపొందారు. 2008లో తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎమ్మెల్సీ పదవిని త్యాగం చేసిన గొప్ప త్యాగశీలి. ఆయన టీఎస్‌పీఎస్సీ (TSPSC) మెంబర్ గాను పని చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థాపర్ రిపోర్టర్'గా...


ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో 1987 - 1991 వరకు ఈనాడు దిన పత్రిక స్టాఫ్ రిపోర్టర్ గా పని చేశారు. అటు జర్నలిస్ట్'గా, ఇటు ఎమ్మెల్సీ గా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని ఆదిలాబాద్ జిల్లా జర్నలిస్టులు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, వివిధ సంఘా ల నేతలు పేర్కొన్నారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.