-Advertisement-

సమన్వయంతో పని చేసేది లేదు.. ఆధిపత్యమే కావాలి..!?

Vaasthava Nestham

• కాంగ్రెస్ Vs బీఆర్ఎస్...!
• వాగ్వివాదాలు.. అడ్డుకోవడాలు 
• సమయపాలన పాటించడం లేదు : కాంగ్రెస్
• ప్రోటోకాల్ పాటించడం లేదు : బీఆర్ఎస్
• నిరసనల మధ్య కొనసాగిన గ్రామసభలు 
• నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవంలో అదే తీరు 
• కుచులాపూర్,లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం


వాస్తవ నేస్తం,ఆదిలాబాద్: కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య ఆధిపత్య పోటీ జరుగుతూనే ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమన్వయంతో పని చేసేది పోయి ఆధిపత్యం కోసం ఆరాటం పడుతున్నారని జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం నిర్వహించిన గ్రామసభల్లో మొదలుకొని నేడు (జనవరి 26) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సైతం కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. జిల్లాలోని పలు మండలాలలో నిర్వహించిన లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్థానిక ఎమ్మెల్యేల ఫోటోలు లేకపోవడంతో ఆగ్రహించిన బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అధికారులతో వాగ్వివాదాలకు దిగిన సందర్భాలు ఉన్నాయి. బోథ్ నియోజకవర్గంలోని కుచులా పూర్ గ్రామంలో నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సమయపాలన పాటించలేదని కాంగ్రెస్ నాయకులు, ఫోటో కాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ నాయకుల మధ్య మాటలు యుద్ధం జరగడంతో ఓకే సారీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బోథ్ నియోజకవర్గంలోని కుచులా పూర్ గ్రామంలో నాలుగు సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభిస్తామని ప్రకటించారు. కానీ స్థానిక ఎమ్మెల్యే రాక కోసం ఎదురుచూస్తున్న అధికారులను బోథ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే రాకపోతే ఉన్నవారితో కార్యక్రమాన్ని ప్రారంభించాలని అన్నారు. అదేవిధంగా సభ వేదికపై కాంగ్రెస్ నాయకులు ఉండడం, అంతేకాకుండా అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ నాయకులు సభ వేదిక వద్దకు వచ్చి ఆందోళన చేపట్టారు. అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు కూడా ముందుకు తోసుకు రావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ ఉన్న పోలీసులు జోక్యం చేసుకొని ఇరు పార్టీల నాయకులను సర్ది చెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారని బోథ్ నియోజకవర్గంలో చర్చలు జరుగుతున్నాయి. 




 
Comments
 -Advertisement-

Join Our Channels

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, రోజువారి తాజా సమాచారం పొందడానికి మా వాట్సాప్ గ్రూప్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి.