అడవంత పండుగ... భక్తితో పులకింత...!
Nagoba Jatara 2025 dates
Nagoba Jatara History
Nagoba jatara temple
Nagoba jatara map
Nagoba jatara wikipedia
Nagoba Jatara in which district
By
Vaasthava Nestham
• నాగోబా వస్తున్నాం...
• అన్ని దారులు కేస్లాపూర్ వైపు
• "గిరి" జనంతో భక్తి సందడి
• నేడు నాగోబా జాతర ప్రారంభం
వాస్తవ నేస్తం,ఆదిలాబాద్ బ్యూరో: ఆదిలాబాద్ అడవుల్లో ఆదివాసీ పండుగ సందడి నేటి నుంచి మొదలుకానుంది. ప్రత్యేక సంగీత వాయిద్యాలు మార్మోగనున్నాయి. డోల్, డప్పులు, డెంసావాయి ద్యాలతో గిరిజన గూడేలు ప్రతి ధ్వనించనున్నాయి. కేస్లాపూర్ నాగోబా ఆలయం గిరి "జనం" తో పుల కించనుంది.. ప్రత్యేక పూజలు.. నైవేద్యాలు.. మొక్కు లతో భక్తి పారవశ్యం వెళ్లివిరియనుంది.. ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతర నేడు మంగళవారం ప్రారంభం కానుంది. ఈ రోజు రాత్రి 10.30 గంటలకు నాగోబా ఆలయంలో మహా పూజ చేయడంతో జాతర షురూ కానుంది. ఈ జాతర 31న ముగుస్తుంది. రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద గిరి జన జాతరగా కేస్లాపూర్ ప్రసిద్ధి చెందింది.
దేశం నలుమూలల నుంచి...
దేశం నలుమూలల నుంచి ఆదివాసీ గిరిజనులు అడ వుల జిల్లా ఆదిలాబాద్ బాట పడుతున్నారు. సంస్కృతి సంప్రదాయాలను ప్రాణంలా చూసుకునే ఈ వేడుకతో కేస్లాపూర్ జాతర సందడి మొదలైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహా రాష్ట్ర, ఆంధ్ర, చత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్య లో భక్తులు తరలిరానుండడంతో అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జాతర నిర్వహణపై ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీ డీఏ పీవో ఖుష్భు గుప్తా, ఎస్పీ గౌస్ ఆలం ఆధ్వర్యం లో సమీక్ష సమావేశం నిర్వహించారు. సంబంధిత అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
గంగాజలంతో... మహాపూజ
నాగోబా మహాపూజ కోసం హస్తినమడుగులో సేకరించిన గంగాజలంతో మెస్రం వంశీయులు కేస్లా పూర్ చేరుకున్నారు. గ్రామ పొలిమేరలోని మర్రిచెట్టు వద్ద బస చేసి, హస్తినమడుగు నుంచి తీసుకొచ్చిన గంగా జలాన్ని మర్రిచెట్టుపైన భద్రపరిచారు. మెస్రం వంశీయులు నేడు నాగోబా ఆలయానికి చేరుకొని గంగాజలంతో శుద్ధి పూజలు చేయడంతో మహా జాతర ప్రారంభం అవుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెస్రం వంశీయులు ఇప్పటికే ఎడ్ల బండ్లపై కేస్లాపూర్ చేరుకున్నారు.
కుండల్లో వంటలు..
ఈ జాతరలో గుగ్గిల్ల వంశీయులు మాత్రమే కుండలు తయారు చేస్తారు. ఇది కూడా సంప్రదాయంలో ఒక భాగమే. అదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రాని కి చెందిన గుగ్గిల్ల స్వామి వంశీయులకు, మెస్రం వంశీ యులకు మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. పుష్య మాసంలో చందమామ కనిపించిన తర్వాత మెస్రం వంశీయులు గుగ్గిల్ల వంశస్తుల వద్దకు వెళ్లి కుండలు తయారు చేయమని చెబుతారు. వంటల కోసం పెద్ద కుండలు, కాగులు, వాటిపై పెట్టే పాత్ర, నీటి కుండలు కలిపి సుమారు ఏడు రకాలుగా తయారు చేస్తారు. వీటిలో గంగాజలం తీసుకొచ్చి వంట చేసి భక్తులకు భోజనం పెడతారు. ఇప్పటికే కుండలు నాగోబా ఆలయంలో భద్రపరిచారు.
22 పొయ్యిలలో... వంటలు
ఈ జాతరలో మెస్రం వంశస్థులు ఎన్ని వేల మంది వచ్చినా వంటలు వండుకునేది మాత్రం 22 పొయ్యిల మీదనే. వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టరు. కేవలం ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఇక్కడ ఉన్న ప్రహరీ లోపల గోడకు చుట్టూ దీపాలు వెలిగించేందుకు ప్రత్యేక అరలు ఉంటాయి. ఆ దీపాల వెలుగులో 22 పొయ్యిల మీద మెస్రం వంశీయులు వంతుల వారీగా వంటలు చేస్తారు.
జాతర నిర్వహణకు రూ.కోటి మంజూరు
నాగోబా జాతర నిర్వహణ కోసం ప్రభుత్వం రూ. కోటి మంజూరు చేసింది. ఈ నిధులతో తాత్కాలికంగా 50 టాయిలెట్స్, 40 వాటర్ ట్యాంక్లు, వేదిక, పారిశుద్ధ్య, మౌలిక వసతులు కల్పించనున్నారు. కేస్లాపూర్కు వచ్చే రోడ్డు మార్గాలకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఇప్పటికే మరమ్మతులు పూర్తి చేశారు. జాతర పర్యవేక్షణకు 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఐదు రూట్లలో జాతరకు వచ్చే భక్తుల కోసం దర్శనం పార్కింగ్, క్యూ లైన్లు, ఇతర సదుపాయాలు ఎక్క డెక్కడ ఉంటాయన్న వివరాలతో రూట్ మ్యాప్ను అందుబాటులో ఉంచారు. ఈసారి జాతరకు వచ్చే భక్తులు ప్లాస్టిక్ వినియోగించకుండా నిషేధం విధిం చారు. ఐటీడీఏ నుంచి క్లాత్ బ్యాగులను పంపిణీ చేసేందుకు ఉంచారు. సుమారు 500 మంది పోలీ సులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. వీరితో పాటు విద్యార్థులతో హెల్ప్ సెంటర్లను ఏర్పాటు చేయను న్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంనుంచి నాగోబా జాతర వరకు ప్రత్యేకంగా బస్సులను నడిపించేందకు చర్యలు చేపట్టారు.
Comments