పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
By
Vaasthava Nestham
వాస్తవ నేస్తం,ఇచ్చోడ(బోథ్): పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నిగిని గ్రామానికి చెందిన రాథోడ్ అర్జున్ (37) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
మద్యానికి బానిసై శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో మద్యం తాగిన మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. చేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
Comments